క్రియాశీలక సభ్యుడు శ్రీనివాసరావుకు భీమా చెక్కుని అందజేసిన గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం, నగిరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యులు ఆశా శ్రీనివాసరావు పాము కాటుకు గురైనాడు. విషయం తెలుసుకొన్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పూర్తి సమాచారాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాము కాటుకు గురైన శ్రీనివాసరావు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున అతనికి హాస్పిటల్ వైద్య ఖర్చులకు 50 వేల రూపాయలను చెక్కును జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకు పంపించడం జరిగింది. మంగళవారం ఆశా శ్రీనివాసరావు ఇంటికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వెళ్లి వారికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపించిన చెక్కుని అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిలాని, నాయబ్ కమాల్, వడ్రాణ మార్కండేయులు, బండారు రవి కాంత్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాదు, పార్వతీ నాయుడు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.