లక్ష్మణరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు మండ లక్ష్మణరావు (బుల్లియ్యా) అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, గుండుబోగుల పెదకాపు, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కరరావు, పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, మేడిచర్ల రాము (ఎంపీపీ), రావూరి నాగు, ఉండపల్లి అంజి, జిల్లెల్ల రక్షక్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-7.30.34-PM-1024x768.jpeg)