జనసేన ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ అంతరాయం పై ధర్నా

ఆముదాలవలస నియోజకవర్గం, కొల్లివలస జంక్షన్ లో కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు మరియు ఎం.పీ.టీ.సి అంపిలి. విక్రమ్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ అంతరాయం పై ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు మద్య తరగతి కుటుంబాలు విద్యుత్ అంతరాయం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జైరాం, సంగం నాయుడు, సంతోష్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.