జాలంపల్లి, దిబ్బ ఊరు గ్రామాల్లో పల్లె పల్లెకి జనసేన

మాడుగుల, పల్లె పల్లెకి జనసేన అనే కార్యక్రమంలో భాగంగా జాలంపల్లి, దిబ్బ ఊరు అనే గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్న జనసైనికులను కలిసి పార్టీ యొక్క సిద్ధాంతాలను వాళ్లందరికీ చెప్పి పార్టీ యొక్క బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గుమ్మడి శ్రీరామ్ తెలియజేసారు. గ్రామస్థాయిలో పార్టీ అనేది బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో పార్టీ అనేది బలంగా ఉంటుందని ప్రతిరోజు మాడుగుల నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లోకి సందర్శించి గ్రామాల్లో ఉండే సమస్యలను పరిష్కరించడానికి పార్టీ బలోపేతానికి నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న గుమ్మడి శ్రీరామ్ కి జనసైనికులు హృదయపూర్వక ధన్యవాదములు తెలపడం జరిగింది.