మునికూడలి గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • బత్తుల బలరామకృష్ణ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిన పాదయాత్ర
  • బత్తుల బలరామకృష్ణ గారి అల్లుడు యువజన నాయకులు తోట పవన్ కుమార్ కి అఖండ స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించిన రాజానగరం నియోజకవర్గం యువజన నాయకులు తోట పవన్ కుమార్. ముందుగా గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ ఉమా పార్వతి సోమేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన తోట పవన్ కుమార్. గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలన అంతమొందించి ప్రజా పరిపాలన తీసుకురావాలని.. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వాన్ని గెలిపిద్దాం అని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.