రఘుదేవపురం గ్రామంలో 3వ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు చేపట్టిన జనంకోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా కొనసాగుతూ 3వ రోజుకి చేరింది.. అడుగడుగునా హారతులు, ఆప్యాయతగా పలకరింపులుతో బత్తుల వెంకటలక్ష్మి గారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.. అనంతరం పాదయాత్రలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీచైన్, బ్యాడ్జ్ అందజేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.