జనసేన భారీ ర్యాలీ మరియు బహిరంగసభ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలం వెంకటాపురం హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ మరియు ర్యాలీ ని ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మరియు రాష్ట్ర కార్య నిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా.విశ్వక్షేణ్ ఆధ్వర్యంలో ఆదివారం సుభద్రాపురం నుండి వీరమహిళలు, జనసైనికులు ర్యాలీగా కవాతు చేసుకొని లావేరు మండలం వెంకటాపురం జంక్షన్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ వేదికలో మండల నాయకులు, జనసేన శ్రేణులు, వీరమహిళలు మరియు జనసైనికులు భారీగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేకం విధానాలపై జనసేన నాయకులు డా.విశ్వఖ్సేణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమలో జి సిగడం, నిద్దాం పంచాయతీ జనసేన సర్పంచ్ నిద్దాం రవి, పాతకుంకం జనసేన ఎంపిటిసి అభ్యర్థి బార్నలా దుర్గారావు, లావేరు మండలం, ఎంపిటిసి అభ్యర్థి రాజారమేష్, లోపెంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దుర్గారెడ్డి, ఎచ్చెర్ల మండలం, డి మత్సలేసం సర్పంచ్ అభ్యర్థి ఆనంద్, రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు, లావేరు సర్పంచ్ అభ్యర్థి నవీరి రాజు, చీపురపల్లి జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మనాయుడు, జనసేన నాయకులు మధుబాబు, బలరాం, రాజేష్, బాబాజీ, రవి, నాని, పవన్ కళ్యాణ్, సూర్య, పవన్, సురేష్, సాయి, మొదలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.