శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జనసేన సమావేశం

అమలాపురం, ఈ నెల 16వ తేదీ శనివారం పవన్ కళ్యాణ్ పాల్గొనగా మండపేటలో జరగబోయే రైతు భరోసా యాత్ర కార్యక్రమానికి సన్నాహకంగా అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆద్వర్యంలో స్థానిక శ్రీ దేవి అమ్మవారి కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభానికి ముందు వరుణ దేవుడు శాంతించాలని, పవన్ కళ్యాణ్ రైతు భరోసా సభ ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ స్థానిక శ్రీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రేపు మండపేటలో జరగబోయే సభను ఏవిధంగా విజయవంతం చెయ్యాలో సమావేశంలో పాల్గొన్న నాయకులు వారివారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ర్ట కార్యదర్శి మహాదశ నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గం నుండి సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, 7వ వార్డు కౌన్సిలర్ గండి దేవి హారిక, సీనియర్ నాయకులు సూదా చిన్న, పిండి రాజా, ఆకుల బుజ్జి సర్పంచ్ లు వాకపల్లి ఈశ్వరి, చిట్నీడి శ్రీదేవి, ఎంపిటిసిలు దోనిపాటి బాలమ్మ, నాగులపల్లి శేషవేణి, అల్లవరం ఉప సర్పంచ్ కంకిపాటి వీరబాబు, మోకా బాలయోగి, వాకపల్లి సత్యనారాయణ, ఆకేటి వెంకన్న, గొలకోటి వెంకటేష్, వీర మహిళలు చిక్కం సుధ, పెయ్యల మంగ, మోసుగంటి మల్లిక, గోళ్ళ కమల, గనిశెట్టి లలిత, సుందరనీడి రాణి, పుష్ప, వరలక్ష్మి, నాయకులు ఆకెళ్ళ నారాయణమూర్తి, జనసేన పార్టీ దళిత నాయకులు తాళ్ళ రవి, ముత్తాబత్తుల శ్రీను పెద్ద ఎత్తున జనసేన క్రియా శీల కార్యకర్తలు, జనసైనికులు పాల్గొని తమ తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది.