విద్యార్దుల సమస్యలపై తెలంగాణ విద్యార్థి విభాగం సమర శంఖం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ సూచన మేరకు.. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. సంపత్ నాయక్ ఆదేశాలతో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మొకురాల కృష్ణ గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహం కి వెళ్లి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడడం, ఆక్కడ ఉన్న సౌకర్యాల గురించి, సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ సాయి కుమార్(మున్నా) ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం జనసేన నాయకులు రవి యాదవ్, చందు నాయక్, సందీప్ తేజ, మరియు నితీష్ పాల్గొనడం జరిగింది.