జనసైనికులకు దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి

జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపురు గంగులయ్య. జనసేన ఆత్మీయ పలకరింపులో భాగంగా సుడిగాలి పర్యటన చేశారు ముందుగా k.కోడపల్లి జనసైనికులతో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ, అలాగే జీ.మాడుగుల మండల ముఖ్య నాయకులతో జనసేన పార్టీని ప్రజల్లో ఎలా బలంగా విస్తరింప చెయ్యాలో ఒక సమన్వయముతో ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. చింతపల్లి మండలం కడశిల్ప గ్రామంలో యువ జనసైనికులు ఉద్దేశిస్తూ పెద్ద వయసుగల ప్రజలను తమ తమ లక్ష్యాలు, ఆశయాలు ఎలా వివరించాలి ప్రజల అభిమానం ఎలా చూరగొనాలి అనే విషయంపై దిశానిర్దేశం చేశారు. గూడెం మండలంలో గూడెం కాలనీలో జనసైనికుడు కుర్తాడా శంకర్రావు పెద్దకర్మకు హాజరయ్యారు, వారి కుటుంబీకులకు ఓదార్చి వారితో కలిసి భోజనం చేశారు అలాగే తన దూరపు కుటుంబ బంధువులతో ఇష్టాగోష్ఠి, తిరుగు ప్రయాణంలో చింతపల్లిలో జనసైనికులతో కాసేపు ముచ్చటించారు. బైలుకించంగి, చెరపల్లి, మేడూరు గ్రామాల జనసైనికులతో జనసేన సిద్ధాంతాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై చర్చించారు.