నాదెండ్ల మనోహర్ రాక ఏర్పాట్లను పరిశీలించిన జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ

27న అవనిగడ్డకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాక ఏర్పాట్లను పరిశీలించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ. ఈనెల 27వ తేదీ శనివారం నాడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అవనిగడ్డ నియోజకవర్గానికి రానున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 తేదీ ఉదయం 11 గంటలకు అవనిగడ్డ రానున్నారని, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. క్రియాశీల సభ్యత్వాలు పంపిణీతో పాటు ఇన్సూరెన్స్ పత్రాలను ఆయన చేతుల మీదగా అందజేస్తారని ఆయన తెలిపారు. దేశంలో ఏ పార్టీ కార్యకర్తలకు లేనివిధంగా జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ను కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ అని కార్యకర్తలు సంక్షేమానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, పార్టీ సీనియర్ నేత రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా కార్యదర్శులు గాజుల శంకర్రావు, కొండవీటి సునీత, సంయుక్త కార్యదర్శులు ఉస్మాన్ షరీఫ్, పద్యాల వెంకట ప్రసాద్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు, సిద్దినేని అశోక్ నాయుడు పార్టీ తదితరులు పాల్గొన్నారు.