జనసేన వార్డు కమిటీ నియామకం త్వరలో నియామకపత్రం

తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పట్టణ కమిటీ అధ్యర్యంలో అంబేద్కర్ నగర్ పాతది 28వ వార్డు, కొత్తది వార్డు 31 వార్డులో జనసేన వార్డు కమిటీ గురించి చర్చించి సభ్యులను తీర్మానం చేయడం జరిగింది. త్వరలో శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా నియామకపత్రం అందచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న పట్టణ అధ్యక్షులు శ్రీ వర్తనపల్లి, పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు రాంశెట్టి సురేష్, జిల్లా కార్యదర్శి మద్దాల మణి కుమార్, పట్టణ కోశాధికారి గుండుమోగుల సురేష్, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి గట్టు గోపికృష్ణ, పట్టణ కార్యదర్శి చాపల రమేష్ మరియు 31 వ వార్డ్ జనసేన నాయకులు కె.మల్లి, వానపాల సాయిరాం, పట్టేం కమల్ రాజ్, సభితి ధర్మాజీ, యమ్ కృష్ణ ప్రసాద్, కొమ్మిరెడ్డి రాంబాబు, కె.నరేష్, కె.భాస్కర్ రావు, వై కృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.