శృంగవరపుకోటలో జనసేనపార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం

శృంగవరపుకోట, జనసేనపార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం శనివారము 11 గంటలకు ముంతాజ్ హోటల్ వద్ద ప్రారంభమయింది. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి హాజరయ్యారు. ఆమె మీడియా ప్రతినిధుల సభలో మాట్లాడుతూ జనసేనపార్టీ కార్యకర్తలకు బరోసా కల్పించాలనే ఉద్దేశముతో పార్టీ సభ్యులకు డెత్ ఇన్సూరెన్స్ 5,00,000 రూపాయలు హెల్త్ ఇన్సురెన్స్ 50,000 రుపాయల వరకు 500 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని అన్నారు. గండవరపు సతీష్ అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, వబ్బిన సత్తిబాబు, కరుకొండ రవి, గొరపల్లి రవి, సురేష్ రాజు చిన్ని చంటి, రమణ నక్కరజు సతీష్ తదితరులు పాల్గొన్నారు.