జెవికె కానుకను పంపిణి చేసిన జనసేన వైస్ ఎంపిపి

ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం కోడేరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలు పునః ప్రారంభ కార్యక్రమంలో ఆచంట మండల వైస్ ఎంపీపీ యర్రగొప్పుల నాగరాజు పాల్గొని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెవికె కానుకను స్కూల్ ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విద్యారిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడేరు ఉప సర్పంచ్ గణేశుల సత్తిబాబు, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు, గ్రామనికి, ఉపాధ్యాయులకు మంచిపేరు గుర్తింపు తీసుకుని రావాలి అని సూచించారు.