మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన పితాని

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల్లంక గ్రామంలో అకస్మాత్తుగా చనిపోయిన గుద్ధటి రాజా వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానికి చెందిన సవరపు ఏసుదాసు ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. వీరివెంట జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు సానబోయిన మల్లికార్జున గుద్ధటి జమ్మి, గోదాసి పుండరీ, కొప్పిశెట్టి గణేష్, బొంతు వీరబాబు, బొంతు సత్యనారాయణ, బొంతు వెంకటరమణ, కడలి నాగేశ్వరరావు, నిమ్మన శ్రీను మరియు గ్రామస్తులు ఉన్నారు.