రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యం

  • రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి
  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

ఒంటిమిట్ట: రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యమని, గ్రామ గ్రామాన జనసేన పార్టీని మరింత బలోపేతంగా చేస్తామని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు బుధవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని చింతరాజు పల్లె పంచాయతీ గాండ్ల పల్లె, పలు గ్రామాలలో 92వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు హామీలతో కూడుకున్న కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.