జనసేన ఆస్ట్రేలియా సమన్వయకర్తలుగా శశిధర్, రాజేష్

ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులకు, వీర మహిళలకు సమన్వయకర్తలుగా శశిధర్ కొలికొండ, రాజేష్ మల్లాను నియమిస్తున్నందుకు సంతోషంగా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నియమించబడిన సమన్వయకర్తలు ఆస్ట్రేలియా జనసేన ఎన్.ఆర్.ఐ. కమిటీల నియామకం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ కార్యకలాపాలకు సంబంధించి వీరిద్దరు సమన్వయంతో పనిచేస్తారని ఆశిస్తున్నాను. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాలోని వివిధ నగరాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించి, ఆయా కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జనసైనికులు, వీరమహిళలు జనసేన పార్టీ పట్ల కనబరుస్తున్న ఆదరణ మరువలేనిది. అధిక సంఖ్యలో హాజరైన జనసైనికులు, వీరమహిళల అంకితభావం నాలో మరింత పట్టుదలను పెంచిందని కె. నాగబాబు స్పష్టం చేశారు.