పరీక్షలు వాయిదా వేయండి: జనసేన డిమాండ్

పాలకొండ: శుక్రవారం పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సత్తిబాబు ఆదేశాలు మేరకు, అత్యవసర మీడియా సమావేశం పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గర్భాపు నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ..నవంబర్ 22 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇంటర్న్ షిప్ కారణంగా సిలబస్ ఇంకా పూర్తికాలేదని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్న, యూనివర్సిటీ మొహం చాటెయ్యడం సరికాదని ఆయన అన్నారు.అలాగే ఈ నెల 19 నుంచి 25 వరకు నేవీ పరీక్షలు ఉన్నాయని, అంతేకాకుండా సిలబస్ పూర్తి కాకుండా, పరీక్షలు వారం రోజుల ముందు షెడ్యూల్ ఇవ్వడం పై ఆయన మండిపడ్డారు. అందుకు 15 రోజులపాటు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.