పంతం నానాజి ఆధ్వర్యంలో జనసేన నిరసన

కాకినాడ రూరల్, రాష్ట్రంలో నెలకొని ఉన్న రహదారుల దుస్థితిపై పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మేలుకొలిపే ప్రయత్నం లో భాగంగా మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ #GoodMorningCMSir అనే పిలుపును ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కాకినాడ రూరల్ ప్రాంతం తూరంగి బ్రిడ్జి దగ్గర చాలా దారుణంగా రోడ్డు పాడైపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న వర్షాలకు ఆ గోతులు చెరువులుగా మారిపోవడం వలన వాహన దారులు మరింత ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, ఈ విషయం అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే తూరంగి జనసైనికులతో కలిసి సోమవారం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.