ఆక్వా రైతును ఆదుకోవాలి: శెట్టి బత్తుల

అమలాపురం: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఫీడ్ చార్జీలు తగ్గించాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన ఆధ్వర్యంలో నవంబర్ 30వ తేదీన అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిరసన చేపడుతున్నట్లు తెలియజేసి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.