జనంకోసం జనసేన పల్లె బాట

మదనపల్లి నియోజకవర్గం: చీకలబైలు గ్రామంలో మేడిపల్లిలో జనంకోసం జనసేన పల్లె బాట కార్యక్రమం జనసేన పార్టీ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరమహిళలతో కలసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ ఈ సైకో పాలన గురించి ఈ చెత్త ప్రభుత్వం గురించి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం గురించి ప్రజలే ఇంకా ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చర్చించుకోవడం జరుగుతుందని, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారో, అదే విధంగా వైసీపీ విముక్త మదనపల్లి, వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంట్ దిశగా తెలుగుదేశం నాయకులతో ప్రస్తుత చీకలబయలు సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ రాజన్న, మాజీ ఎంపీటీసీ శంకరప్ప, వార్డు మెంబెర్ కృష్ణవేణి మరియు తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులతో కలసి పర్యటించి గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం జెండా ఎగరావేయడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమం లో రెడ్డెమ్మ, లవన్న, జంగాల గౌతమ్, గండికోట లోకేష్, జయ, చంద్రశేఖర, నాగవేణి, జనార్దన్, రమణ యాదవ్ జోలపేట, సర్పంచ్ తమ్ముడు రవీంద్ర, నరసింహులు, జెస్వంత్, లక్ష్మన్న, భూపతి మరియు చీకలయబైలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.