కళింగపట్నంలో బీచ్ వద్ద 23-01-2022 న జనసేన సభ

శ్రీకాకుళం జిల్లా, గారమండలం, జనసైనికులకు, జనసేన కార్యకర్తలకు, మెగా అభిమానులు అందరికీ తెలియజేయనది ఏమనగా గుంటు శ్రీను ఆధ్వర్యంలో కె మత్స్యలేశం పోర్ట్ కళింగపట్నంలో బీచ్ వద్ద 23-01-2022 ఈ ఆదివారం జనసేన సభ ఏర్పాటుచేయడం జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా మన శ్రీకాకుళం నియోజవర్గ నాయకులు అందరూ హాజరవుతారు. కావున గారమండలం గ్రామల్లో నివసిస్తున్న ప్రతీ ఒక్క జనసైనికుడు, జనసేన కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం… ఈ సభ ఉద్దేశం ఏమనగా గారమండలం గ్రామాల్లో జనసేన పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలని, మన జనసేన పార్టీని మన గ్రామాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని, మన మండలంలో ఎవరెవరిని ఇంఛార్జిలు నిలబెట్టి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి పార్టీని మండలంలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఈ సభ ఉద్దేశం. అందుకని ఈ సభకు ప్రతీ ఒక్క జనసైనికుడు హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటున్నామని గుంటు శ్రీను అన్నారు.