సైనికులకు సెల్యూట్ చేసిన జనసేనాని

జనసేన అధినేత సైనికులకి సెల్యూట్ చేశారు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆర్మీ డే సందర్భంగా.. సైనికులని ప్రశంసించారు. ఆర్మీ డే భారతీయులందరికీ పుణ్యదినమన్నారు. వీర జవానుల త్యాగాలను త్రికరణశుద్ధిగా స్మరించుకొనే రోజు ఇదేనన్నారు. ఈ దేశాన్ని కాపాడే వీర పుత్రులకు జేజేలు పలుకుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

“130 మంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవాన్ల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం. నిండైన మనసుతో వారికి జేజేలు పలకడం తప్ప. ఎండనక, వాననక, కులాలకతీతంగా అహర్నిశలు మన దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగనిరతి వెలకట్టలేనిది. మన ప్రాణాలను రక్షించడానికి తమ ప్రాణాల్ని అడ్డువేసే వారి ధీరత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా సెల్యూట్‌ చేస్తున్నా”నని పవన్ పేర్కొన్నారు.