విఆర్ఏ దీక్షలకు జనసేన సంఘీభావం

మండలంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (వి.ఆర్.ఏ) లు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలకు కొత్తపేట జనసేన నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇలా ఉండగా ఈ దీక్షలు బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఏ.పి. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వి.ఆర్.ఏ. నాయకులు మాట్లాడుతూ వి.ఆర్.ఏ లకు కనీస వేతనం 21వేలు ఇవ్వాలని, డి.ఏ తో కలిపి వేతనం చెల్లించాలని, నామిని లను వి.ఆర్.ఏ లు గా నియమించాలని, అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజనసేన నాయకులు తులా రాజు, మల్లవరపు నాగ భూషణం, కురసాల వెంకన్న, కంఠంశెట్టి చంటి, చోడపనీడి ఉమ, పచ్చి పులుసు గుప్త, వక్కపట్ల చంద్రశేఖర్, సలాది రమేష్, సంఘం అధ్యక్షుడు కె.భీమ శంకరం, ప్రధాన కార్యదర్శి పిల్లం గోరు బాలు, కోశాధికారి సిద్దా నాగ భూషణం, అవిడి సత్యనారాయణ, చింతంపుల్లయ్య పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-23-at-7.44.36-PM-1024x472.jpeg