జనసేన ఆత్మీయ సమావేశం

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం, బాలి గౌరీ నాయుడు అధ్వర్యంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ నాయకులు ఎం.రాఘవ రావు, శ్రీను, సాయిబాబా మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీనీ ఏ విదంగా బలోపేతం చేయాలి, కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని, ఆ తీర్మానాలు హైదరాబాద్ లో గల పార్టీ ఆఫీస్ కీ పోస్ట్ ద్వారా పంపాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.