పామూరు జనసేన ఆధ్వర్యంలో రంగా జయంతి

పామూరు, పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగా 75 వ జయంతి పురస్కరించుకొని కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పామూరులోని మమ్మి డాడీ సెంటర్ నందు రంగా ఫొటో కి పూలమాల వేసి, పాలాభిషేకం చేసిన అనంతరం కేక్ కట్ చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా రంగాకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పామూరు జనసేన నాయకులు మరియు కాపు నాయకులు, కాపు యువత, రంగా అభిమానులు పాల్గొన్నారు.