అగ్నిప్రమాద బాదితులకు అండగా జనసేన నాయకులు

గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం, కే కొత్తవలస గ్రామానికి చెందిన బోను పాపమ్మ అప్పయ్య దంపతు నివసిస్తున్న ఇల్లు మంగళవారం అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న దత్తి రాజేరు మండలం అధ్యక్షులు అప్పారావు గురువారం ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి, ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం, 10 కేజీలు బియ్యం, నిత్య అవసర సరుకులు ఇవ్వడం జరిగింది. కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందించాలని అక్కడున్న గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వ అధికారులకు సూచించడం జరిగింది. అలాగే మీ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా మా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతినగరం మండల అధ్యక్షులు మునక్కాల జనార్ధన్, పల్లి సత్యనారాయణ, మామిడి దుర్గాప్రసాద్, సింహాద్రి, ప్రవీణ్ కుమార్, కిక్కర్ భాస్కరరావు, మారడాన దుర్గారావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.