అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, గొల్లప్రోలులో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో రామిశెట్టి చంద్ర రావు శ్రీ శ్రీనివాస ట్రేడర్స్ గోనే సంచుల గోదాము, మేడతని వీరబాబు షాప్ మరియు పక్కనే ఉన్న టెంట్ హౌస్ షాప్ సామానులు దగ్ధమైనాయి. జనసైనికుల నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి వారిని పరామర్శించి, ఈ ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల వివరణ ప్రకారం ఎవరో కక్ష పూరితంగానే మంటలను అంటించారని, అగ్ని ప్రమాదం వల్ల కోటి రూపాయలు పైగానే నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. శేషు కుమారి మాట్లాడుతూ బాధితునికి ఎల్లవేళలా జనసేన పార్టీ తోడు ఉంటుందని భరోసాను ఇచ్చారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని, పోలీసు వారు దర్యాప్తును వేగవంతం చేసి అగ్ని ప్రమాదానికి కాకులైన నిందితుల్ని శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గొల్లప్రోలు వార్డు అభ్యర్థి వినుకొండ అమ్మాజీ, గారపాటి శివ కొండారావు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.