నిజాం కళాశాల విద్యార్థినుల పోరాటానికి మద్దతుగా జనసేన విద్యార్థి విభాగం

గత 15 రోజుల నుంచి నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్థినిలు హాస్టల్ కేటాయించాలని చేస్తున్న పోరాటానికి జనసేన విద్యార్థి విభాగం మొదటి నుంచి తోడుగా ఉంటుంది. మంగళవారం జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల విద్యార్థినులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లి వారితో కలిసి నిరసన తెలిపారు. గత 15 రోజుల నుంచి విద్యార్థినులు చెట్టు కింద కూర్చునే నిరసన తెలుపుతున్నప్పటికి అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం అని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జనసేన విద్యార్థి విభాగం అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. విద్యార్థినులు చేస్తున్న ఈ ఉద్యమం స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా విద్యార్థినిలు చూపిస్తున్న పోరాటపటమను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ అధ్యక్షులు వినోద్ నాయక్, నిజాం కళాశాల జనసేన విద్యార్థి నాయకులు సాయి, మహేష్, సాయి రాజ్, సూర్య, శశి, వెంకటేష్, శివ, సందీప్, రాకేష్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.