అగ్నిప్రమాద కుటుంబానికి బాసటగా పర్చూరు జనసేన నాయకులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం, పూసపాడు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కుప్పాల శ్రీనివాసరావు గృహం, షాప్, ఇంటి సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి, వారు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. వారి జీవితం, వ్యాపారం, పునరాభివృద్ధి అవ్వడానికి సహాయంగా, మేము ఉంటాం మీకు తోడుగా అంటూ పర్చూరు నియోజకవర్గం జనసేన యువనాయకులు మన్నెం శ్రీకాంత్ వారితో ఫోన్ లో మాట్లాడి వారికి అండగా మేము అందరం ఉంటాం అంటూ పదివేల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన సీనియర్ నాయకులు కొండపల్లి వెంకటేశ్వరరావు, నాగులుప్పలపాడు మండలం జనసేన నాయకులు బూసి సుబ్బారావు, ఇంకొల్లు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుప్పాల మహేష్, దావులూరి పవన్, చిరంజీవి, వసంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.