అగ్నిప్రమాద బాదితులకు అండగా జనసేన

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామ ఈబీసీ కాలనీలో శనివారం పూరి గుడిసె కాలిపోవడం జరిగింది. ఈ విషయం జనసేన నాయకులు పి ఎస్ ఎన్ మూర్తికి తెలియజేయగా జనసేన ఇంచార్జ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి సోమవారం బియ్యం బస్తా కూరగాయలు జనసేన పార్టీ తరఫున అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కార్రీ కాశి, పెంకె జగదేష్ భీమేశ్వరావు, కోలా దుర్గాదేవి, ముప్పాన రత్నం, పబ్బిరెడ్డి ప్రసాద్, జనసేన పార్టీ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, దేశిరెడ్డి సతీష్, బస్వా గోపి, బావిశెట్టి నాది, నిమ్మన దుర్గ బాబు, తేలు శ్రీను, బస్వా శివ, పట్టం వీరబాబు, నాగం వెంకన్న, పిల్లి శ్రీనివాస్, గిసాల దుర్గాప్రసాద్, దెయ్యాల అప్పారావు, వల్లి దుర్గ బాబు, షేక్ మేర, దుంపలపూడి శివ, పి ఎస్ ఎన్ మూర్తి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.