టీడీపీ రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పేరాబత్తుల రాజశేఖర్, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం వేళంగి పంచాయతీ కార్యాలయం ప్రక్కన 12వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల కార్యదర్శి చింతా వెంకట్, పెద్ద కొత్తూరు గ్రామ అధ్యక్షులు అల్లు గంగాద్రి, వేలంగి జనసేన నాయకులు మురళి, జనసైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ‘నేను సైతం బాబుతో’ కార్యక్రమం కోసం సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, కోనా వెంకటలక్ష్మీ, కే వినాయక్, బొంతు నాగేశ్వరరావు, గీశాల వెంకటేశ్వరరావు, అడపా రామచంద్రరావు, కే భూషనం, పురం సత్యప్రసాద్, చుండ్రు వెంకన్న రాయ్ చౌదరి, పలివెల జానకీ రామయ్య, మేడిశెట్టి పట్టాభి, నులుకుర్తి వీరన్న, కెవిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.