తుఫాను కారణంగా ఇంటిని కోల్పోయిన తాతబ్బాయికి అండగా జనసేన

కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ మండలం, తిమ్మాపురం గ్రామం హరిజన పేట నివాసి దాయం తాతబ్బాయి ఇల్లు ఇటీవల తుఫాను కారణంగా వచ్చిన వర్షాలకు నాని పోయి ఇంటిపై కప్పు పూర్తిగా పడిపోయి ఇబ్బందుల్లో ఉన్నారని జనసేన నాయకులు మాదారపు తాతాజీ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీకి తెలియ చేశారు. వెంటనే వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వారికి అండగా ఉంటామని, మరియు అధికారులతో మాట్లాడి తగిన సహాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా వారికి 15000 రూపాయలు మరియు నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, లోవబాబు, దుర్గబాబు, సతీష్, వీరబాబు, సంతోష్ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.