నందిగామలో జనసేన – టీడీపీ ఆత్మీయ సమావేశం

నందిగామ నియోజవర్గం: పట్టణం మధిర ఆర్చి రోడ్డు ఆర్ఎస్ గార్డెన్స్ నందు బుధవారం జనసేన – తెలుగుదేశం నందిగామ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య జనసేన-టిడిపి పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఏపీలో సుస్థిర పాలన కోసం తెలుగుదేశం జనసేన కలిసి పని చేస్తున్నాయి. ఓటర్ లిస్టును అపహస్యం చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు. నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై ఛార్జ్ షీట్ తయారు చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గొయ్యిలో పాతి పెట్టడానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జనసేన – తెలుగుదేశం పార్టీల నాయకులు సమన్వయంతో నిర్వహించాలి. నియోజకర్గంలోని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ. ఇరు పార్టీ నాయకుల ఉమ్మడి పోరాటానికి నాందిగా ఈ నెల 18, 19 తేదీలలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసనలు చేపడతాం. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేద్దాం అని పేర్కొన్నారు.