వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ

కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు పామూరు మండల అధ్యక్షులు ఏడుకొండల సహకారంతో పామూరులోని వడ్డె పాలెం కాలనీలో రాయుడు మల్లికార్జున ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఆమంచి రాజేంద్ర రాయిని రమేష్, చిట్టెం ప్రసాద్, రాంబాబు, జిల్లా నాయకులు, కనిగిరి నియోజకవర్గం మండల అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ కనిగిరి నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.