వెలిగండ్ల మండలంలో పర్యటించిన జనసేన

కనిగిరి, జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సారథ్యంలో వెలిగండ్ల మండలం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సనివారం వెలిగండ్ల మండలంలో పర్యటించి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలోపేతం గురించి చర్చించి తగుసూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. తదుపరి పటేల్ అనే జనసైనికుడికి కాలు విరిగింది అని తెలుసుకొని అతనిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ గజ్జ అనిల్, హరినాథ్, వలి, ఆంజనేయులు, సాయి కిషోర్, ప్రేమ్ కుమార్, మహేంద్ర, అయ్యప్ప మరియు జనసేన కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.