ప్రమాదబాధితులకు వైద్యం చేయించిన జనసేన

పిఠాపురం సాయిబాబా గుడి సెంటర్లో ఒక కారు ప్రమాదవశాత్తు మిఠాయి కొట్టులొకి దూసుకు వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకు గాయాలయ్యాయి. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. రామాపురం వాస్తవ్యులు ఒక మహిళకు నడుముకు తగలడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు జనసైనికులు వచ్చి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి హుటాహుటిన తీసుకెళ్లి ఆమెకు ట్రీట్మెంట్ చేయించి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుణ్య మంతుల సూర్యనారాయణ మూర్తి, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లి గోపు సురేష్, రామకృష్ణ, యండ్రపు శ్రీనివాస్, వంకా కొండబాబు, ఇజ్రాయిల్, కసిరెడ్డి నాగేశ్వరరావు, శ్రీకాంత్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.