కళ్యాణదుర్గంలో ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

కళ్యాణదుర్గం: మెగా పవర్ స్టార్ & గ్లోబల్ స్టార్ కొణిదెల “రామ్ చరణ్” జన్మదినం సందర్భంగా, జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం కళ్యాణదుర్గం తాలూకా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు చాపిరి రాఘవేంద్ర గుప్తా ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషెంట్లకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ పుట్టిన రోజు కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, మెగాస్టార్ చిరంజీవి గారి సీనియర్ జిల్లా నాయకులు మౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, శెట్టూరు మండల అధ్యక్షులు కాంతరాజు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కళ్యాణదుర్గం ముఖ్య నాయకులు రాజు, చిత్తప్ప, రహుల్ల, రామ్ చరణ్ అభిమానులు మూర్తి, శివ, దేవా, జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.