మారిశెట్టి అజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శనివారం టౌన్ జనసేన లీడర్, జిల్లా కాపు యువత అధ్యక్షులు అయిన మారిశెట్టి అజయ్ బాబు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో అప్పటి తాడేపల్లిగూడెం నియోజక వర్గ ప్రజారాజ్యం ఎమ్మెల్యే.. ఈలి నాని, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, విద్యార్థులు, విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. ఈలి నాని, మారిశెట్టి అజయ్ బాబు చేతుల మీదుగా సుమారు 75,000/- రూపాయలను వైద్య చికిత్స నిమిత్తం ముగ్గురు పేషెంట్లకు ఆర్థిక సహాయం చేశారు. అప్పటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఈలి నాని మాట్లాడుతూ.. కేవలం కేక్ కటింగ్లు, ఫ్లెక్సీలకు మాత్రమే కట్టు బడకుండా అవసరార్ధులను గుర్తించి, వారి కష్టాలలో తోడు మేమున్నాం అంటూ సుమారు 75,000/- రూపాయలను చేయూతగా, ఆర్థిక సహాయం చెయ్యటం చాలా గొప్ప విషయమని, జనసేన అంటేనే.. ప్రజా సేవ అని దానికి కట్టుబడి మీరు పనిచేయటం ఆ పార్టీకి మేలు చేస్తుందని వచ్చే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, రాష్ట్రానికి మంచి పరిపాలన, సేవ చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లను మారిసెట్టి అజయ్ బాబు యువసేన & టీం సైనిక సభ్యులు కృషి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *