బ్రాహ్మణ సమాఖ్య కమ్యూనిటీ భవన నిర్మాణానికి శ్రీమతి బత్తుల విరాళం

  • శ్రీ లక్ష్మి నృసింహ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య నూతన కమ్యూనిటీ భవన “ నిర్మాణానికి 1,00,000 /- రూపాయలు విరాళమిచ్చిన బత్తుల వెంకటలక్ష్మి…

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య వారిచే సంత మార్కెట్ వద్ద నిర్మించబడిన నూతన కమ్యూనిటీ హాల్ ఆదివారం నూతనంగా ప్రారంభించబడింది. న్ఈ కార్యక్రమమునకు జనసేన పార్టీ తరుపున శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ లక్ష్మి నృసింహ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య కమిటీ భవన నిర్మాణ అభివృద్ధికి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి నృసింహ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య కమిటీ సభ్యులు జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మికి పుష్ప గుచ్చము అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మితో పాటు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *