జనసేన పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా

రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో మల్కిపురంలో బుధవారం జరిగిన ముతూట్ ఫైనాన్స్ వారి జాబ్ మేళాకు రాజోలు పరిసర ప్రాంత నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది. సుమారు 110 మంది హాజరవగా విశిష్ట ప్రతిభ కనపరచిన 10 మందిని ముతూట్ కంపెనీ వారు ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే తమ ఆహ్వానం మేరకు మల్కిపురంలో జాబ్ మేళా నిర్వహించిన ముతూట్ సంస్థ ప్రతినిధులకు మరియు స్థల సహకారం అందించిన గుబ్బల రవికిరణ్ కి రాజోలు జనసేన ఐటీ విభాగం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరవ సందీప్, చింతక్రింద శ్రీనివాస్, బొలిశెట్టి కృష్ణ, మేడిపల్లి సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.