రెడ్డి అప్పల నాయుడు సమక్షంలో జనసేనలో చేరికలు

ఏలూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఏలూరు నియోజకవర్గంలో రెడ్డి అప్పల నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై శుక్రవారం శ్రీ గణపతి వస్త్ర సంక్షేమ సంఘం వారు సుమారు 50 మంది పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.