మదనపల్లి జనసేనలో చేరికలు

మదనపల్లి నియోజకవర్గం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో రామసముద్రం మండలం గొల్లపల్లి, చొక్కా వాండ్లపల్లి, కురకపల్లి, రాగి మాకులపల్లి, బార్లపల్లి నుండి మంజునాథ్ మరియు సురేష్ ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు అధ్యక్షతన పెద్ద ఎత్తున దాదాపు 75 మంది యువత జనసేన పార్టీ కండువా కప్పుకొని పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ముందుకు వెళ్తామని వ్యూహం అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు, ఆయన ఆదేశానుసారం మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే దిశగా పనిచేస్తామని ముక్తకంఠంతో తెలియజేశారు. రాగిమాకులపల్లి నుండి, మంజునాథ్, నాని, భాస్కర్ రెడ్డి సురేంద్ర, ఆధ్వర్యంలో నాయుడు, మహేష్, శివ, శీన, రెడ్డి, నరసింహులు, మస్తాన్, సందీప్, పవన్, భగవాన్, గొల్లపల్లి నుండి సురేష్, గణేష్ ఆధ్వర్యంలో చలపతి, శ్రవణ్ కుమార్, రోహిత్, బాషా, గంగాధర, చొక్కోండ్లపల్లి పంచాయతీ నుండి కళ్యాణ్ గోపి ఆధ్వర్యంలో సురేందర్ రెడ్డి యువకుమార్ వెంకటేష్ గణేష్, కురకపల్లి నుండి గిరీష్ ఆధ్వర్యంలో మోహనా నరేష్, జనసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్ మదనపల్లి జనసేన నాయకులు శంకర, అశోక్, ధరణి, జనసేన సోను, సుప్రీమ్ హర్ష, నవాజ్, శేఖర, సాయి, భాను, సందీప్, నవీన్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.