మారేడుమిల్లిలో జనసేనలో చేరికలు

అల్లూరి జిల్లా, రంపచోడవరం, శుక్రవారం నియోజవర్గం మారేడుమిల్లి మండలం మలిషాల గ్రామంలో జనసేన పార్టీ రంపచోడవరం నియోజవర్గం నాయకులు కుర్లా రాజశేఖర్ రెడ్డి, మారేడుమిల్లి మండల అధ్యక్షులు మల్ల దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు బి.సత్య ఆధ్వర్యంలో 8 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనే సాధ్యమని రాజశేఖర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసు మరియు గణేష్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.