తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీలో చేరికలు

  • బొలిశెట్టి శ్రీనివాస్ సేవాకార్యక్రమాలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో పలువురు చేరిక

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జి బోలిశెట్టి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పుల్లయ్య గూడెం బీసీ కమ్యూనిటీ గంగిరెడ్ల సంఘానికి చెందిన చింతల కొండయ్య (గంగిరెడ్ల సంఘ రాష్ట్ర కమిటీ మెంబెర్) ప్రెసిడెంట్ ఆవుల కొండయ్య, అడ్డగర్ల సురేష్ అధ్యర్యంలో సుమారు వందమంది వైయస్సార్సీపీ కార్యకర్తలు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గంగిరెడ్ల ంబ్చ్ పథకం కింద ఒక్కొక్కరికి 30 వేల రూపాయల లోన్లు ఇచ్చేవారని దాన్ని అమలు చేయడం మానేసి మా బిసిలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కి సిగ్గులేదా అని అడుగుతున్నాను. ఈ ఊరికి రోడ్లు లేవు డ్రైనేజి లు లేవు ఇటువంటి వైస్సార్సీపీ పార్టీ ని ప్రజలు తెరస్కరిస్తున్నారని జనసేన పార్టీ ని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎంత దోచుకుంటున్నారో తాడేపల్లిగూడెం ప్రజలే చెబుతున్నారని ఎదురుతెరిగితే కేసులు పెట్టించే ఇటువంటి మనిషి మనకు అవసరమా ఎర్రచందనం, మట్టి, ఇసుక దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు.. అనంతరం తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో పల్లేపోరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ప్రసాద్ మరియు జగ్గన్నపేట, తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.