నాదెండ్ల సమక్షంలో జనసేనలో చేరికలు

తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గం వైసిపి జిల్లా సీనియర్ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి సోమవారం మేళం శ్రీనివాస్ రావు వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారితోపాటు కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, టంగుటూరు మండలం నాయకులు లింగంగుంట చంద్రవాస్, కొండపి మండలం అధ్యక్షులు వై.విశ్వనాగ బ్రహ్మ, దేవరపల్లి బాబ్జి, తేళ్ల రవికుమార్, మట్టుపల్లి రమేష్ పాల్గొని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.