ఎర్రగుడి భవిష్యత్తు గారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు

ఉరవకొండ: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్ గారంటీ కార్యక్రమం సోమవారం ఎర్రగుడి గ్రామంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ కుమారుడు పయ్యావుల విజయసింహ పాల్గొన్నారు. భవిష్యత్తు గారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు కలయికగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సన్నాహాలు చేస్తున్నాయని, అదేవిదంగా సూపర్ సిక్స్ గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆశీర్వాదం మరియు ప్రజల మద్దతు కావాలని పయ్యవుల కేశవ్ తనయుడు పయ్యావుల విజయసింహ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులతో పాటు జనసేన పార్టీ బెలుగుప్ప మండల అధ్యక్షుడు కాసంశెట్టి సుధీర్ జనసైనికులు సాయి, నరేంద్ర, జోగినాథ్, ఓబులేసు(అఖిల్), ఆది, అజయ్ పాల్గొన్నారు.