వడమాలపేట మండలంలో జనసేన పార్టీలో చేరికలు

నగరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నగరి నియోజకవర్గం, వడమాలపేట మండలంలో గురువారం మెరుపుల మహేష్ ఆధ్వర్యంలో కల్లూరు పంచాయితీ చెందిన యువ నాయకులు జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముని శేఖర్ యాదవ్ అధ్యక్షతన ఉపాధ్యక్షులు శేషాద్రి మరియు కుమార్ అలాగే ప్రధాకార్యదర్శి సునిల్ జనసైనికులు తదితరులు కూడా పాల్గొన్నారు.