ఉంగుటూరులో జనసేనలో చేరికలు

పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజవర్గం, జనసేన పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసం చూరగొంటున్నదని దానికి ప్రతీక జిల్లాలో విస్తృతంగా ఇతర పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరడమేనని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు అన్నారు. మంగళవారం ఉంగుటూరు నియోజవర్గం నాయకులు, పెడనిండ్రకొలను మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ వంగా రఘురామ చంద్రశేఖర్(రఘు), జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటి సభ్యులు శ్రీ కనకరాజు సూరి సమక్షంలో అధికారికంగా జనసేన తీర్థం పుచ్చుకుని ఆయన అనుచరవర్గంతో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.