పాఠంశెట్టి దంపతులకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజమండ్రి జనసేన

జగ్గంపేట, గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రమాదకరమైన 33 కెవి విద్యుత్ లైన్లు తొలగించాలని నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పాఠంశెట్టి సూర్యచంద్ర శ్రీదేవి జగ్గంపేట నియోజకవర్గం. నిరహార దీక్ష ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్లను తొలగించడానికి నిర్ణయించారు. సూర్యచంద్ర శ్రీదేవి చేసిన కృషి ఎనలేనిది. వారిని ఆదివారం సూర్యచంద్ర శ్రీదేవి పెళ్లి రోజు సందర్భంగా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విన్నా వాసు జనసేన పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ కార్యదర్శి పడాల వీర్రాజు, రొక్కం నాగు చింతా మణికంఠ, అడబాల రమణ, రోక్కం ఉమా శంకర్, ఇమ్మంది సురేష్, కేశనకుర్తి దుర్గా ప్రసాద్, ప్రెగరెడ్ల నాగేంద్ర, ఉడత దుర్గా రావు, గీసాల దుర్గ కలవడం జరిగింది.